Saturday, May 4, 2024

Chandrababu: నేడు జీడినెల్లూరులో చంద్రబాబు కదలి రా సభ

ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదలి రా సభను ఇవాళ గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడు పల్లి వద్ద నిర్వ‌హిస్తున్నారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు.

ఈ సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు భారీగా తరలిరానున్నారు. ఇందుకోసం 20 ఎకరాలతో సభాస్థలి 30ఎకరాలతో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement