Monday, April 29, 2024

PM Modi: ఇవాళ ప్ర‌ధాని మోదీ గోవా ప‌ర్య‌ట‌న‌…. ‘ఇండియా ఎనర్జీ వీక్’ను ప్రారంభించనున్న పీఎం

భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో మంగ‌ళ‌వారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రారంభించనున్నారు. అలాగే 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

దాంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్‌డ్ ఇండియా, డెవలప్‌డ్ గోవా 2047 కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇక, ఇవాళ దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఉదయం 10.30 గంటలకు ఓఎన్‌జీసీ సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి.. ఆ తర్వాత ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభంచనున్నారు. ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతి పెద్ద ఓమ్నిచానెల్ ఎనర్జీ ఎగ్జిబిషన్.. దీని ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమంలో 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement