Tuesday, May 14, 2024

రాష్ట్రం బాగుండ‌టం చంద్ర‌బాబుకు ఇష్టం లేదు : శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్రం బాగుండ‌టం చంద్ర‌బాబుకు ఇష్టం లేద‌ని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగుల‌కు కరోనా కష్ట సమయంలోనూ ప్రభుత్వం జీతాలను పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు. రాజకీయ పార్టీల ట్రాప్ లో పడకుండా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగమేనని గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలను సమభావనతో చూస్తుందన్నారు. ఎవరికీ అన్యాయం చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ముఖ్యమంత్రిని కించపర్చేలా మాట్లాడటం తగదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement