Friday, April 26, 2024

Tirupati | అక్రమాస్తుల కేసు.. సోషల్ వెల్ఫేర్ డీడీ యుగంధర్ ఇంటిపై ఏసీబీ దాడులు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్ట‌ర్గా విధులు నిర్వహిస్తున్న యుగంధర్ ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తిరుపతి ఏసీబీ డీఎస్పి జనార్దన్ నాయుడు ఆదేశాల మేరకు కర్నూల్ రేంజ్ ఏసీబీ డిఎస్పి శివ నారాయణ స్థానిక రైల్వే కాలనీలో నివాసం ఉంటున్న యుగంధర్ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడులలో కోటి 75 లక్షల పైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు క‌నుగొన్నారు. కాకినాడలో జి ప్లస్ త్రీ భవనాలు మూడు, మూడు పంట పొలాలు, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని పట్టా భూములు, 875 గ్రాముల బంగారం విలువ కలిగిన అక్రమ ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో వెల్ల‌డ‌య్యింది. ఇవే కాక అనేక ఆస్తులు ఉన్నట్లు సోదాలో బయటపడింద‌ని, వాటిపై రాబోయే రోజుల్లో మ‌రిన్ని సోదాలు నిర్వహిస్తామ‌ని డీఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement