Sunday, April 28, 2024

AP : అబద్ధాలు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ.. వంగ‌ల‌పూడి అనిత‌

విశాఖ‌ప‌ట్నం – అబద్ధాలు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దండుపాళ్యం బ్యాచ్ తో జగన్ సభలు నిర్వహిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

విశ్వసనీయత అనేది లేని వ్యక్తి జగన్ అని దుయ్య‌బట్టారు. అబద్దాలకు, మోసాలకు కేరాఫ్ అడ్రస్​గా వైసీపీ పార్టీ నిలిచిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చని వ్యక్తి జగన్ అంటూ సైటర్లు వేశారు. మద్యం లేకుండా చేసి ఓట్లు అడుతానని చెప్పిన జ‌గ‌న్ కొత్త మద్యం పాలసీ తెచ్చి అక్రమంగా సంపాదిస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో నకిలీ మద్యంతో 30 లక్షల కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టార‌ని ఫైర్ అయ్యారు. , రాజధాని, పోలవరం, హోదా, జోన్ లేకుండా సిద్ధం అని ఎలా అంటార‌ని అనిత నిలదీశారు..

- Advertisement -

మద్యం లేకుండా చేసి జగన్ ఓట్లు అడుతానని, కొత్త మద్యం పాలసీ తెచ్చి అక్రమంగా సంపాదిస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ముంచెత్తాడు 30 లక్షల కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టాడని, రాజధాని, పోలవరం, హోదా, జోన్ లేకుండా సిద్ధం అని ఎలా అంటాడు విశాఖలో ప్రభుత్వ ఆస్థులన్నీ తాకట్టు పెట్టేశార‌ని దుయ్యాబ‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement