Monday, May 6, 2024

AP: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ఆగి ఉన్న‌ లారీని కారు ఢీకొన‌డంతో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కేతనకొండ గ్రామంలో చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన‌ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాడ పడ్డారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు న‌మోదు చేసి, పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement