Saturday, May 4, 2024

TTD : 21నిమిషాల్లో టికెట్ల విక్ర‌యం…ఈ నెల 12న తిరుమలలో బ్రేక్ దర్శనాల రద్దు

తిరుమలలో దీపావళి సందర్భంగా ఈ నెల 12న బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఆ రోజున శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. కేవలం ప్రోటోకాల్ దర్శనాలను మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది.ఈ నేపథ్యంలో, ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేసింది. కేవలం 21 నిమిషాల్లోనే ఈ టికెట్లు అయిపోయాయి. మొత్తం 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. టీటీడీఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement