Sunday, April 28, 2024

High Court: సీఐడీ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా

సీఐడీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న అమరావతి అసైన్డ్ భూముల అక్రమాల కేసును రీఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. కాగా అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలోనే కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసులపై విచారణ రీఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement