Wednesday, May 1, 2024

WGL : రోడ్డు ప్రమాదంలో వైస్ ఎంపిపి భర్త మృతి

భూపాలపల్లి, ప్రభన్యూస్ ప్రతినిధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి- కాటారం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. పందులను తప్పించపోయి, అదుపుతప్పి సఫారి కారు బోల్తా పడగా ఈ ప్రమాదంలో మహదేవపూర్ వైస్ ఎంపిపి భర్త, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బండం లక్ష్మారెడ్డి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి.

గుంటూర్ లో కుమారుని వివాహం ఫిక్స్ చేసుకొని తిరిగి వచ్చే క్రమంలో తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. కాగా క్షతగాత్రులు భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement