Thursday, May 16, 2024

AP | శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. 15 రోజుల్లో రూ.3 కోట్లకు పైగానే

శ్రీశైల ప్రభ న్యూస్ : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మల్లన్న ఆలయంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయాలు, పరివార ఆలయాల హుండీ లెక్కింపును నిర్వహించారు. చంద్రావతి కల్యాణ మండపంలో ఈ లెక్కింపు నిర్వహించగా… శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 87 లక్షల 52 వేల 761 రూపాయల నగదు ఆదాయం వచ్చిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.

గత 15 రోజులుగా భక్తులు ఈ ఆదాయాన్ని శ్రీ స్వామి అమ్మవార్లకు కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపులో నగదుతోపాటు 263 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 9 కిలోల 700 గ్రాముల వెండి… నగదు బంగారంతో పాటు 44 అమెరికన్ డాలర్లు, 1 ఒమానీ రియాల్, 101 ఖతార్ రియాల్, 1.75 కువైట్ దినార్, 5 యూఏఈ దిర్హామ్ లు, 30 సౌదీ అరేబియా రియాళ్లు, 20 కెనడా డాలర్లు ఇలా వివిధ దేశాల విదేశీ కరెన్సీలు ఈ లెక్కన లభించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవస్థానం ఈవో పెద్దిరాజ్‌ ఆధ్వర్యంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయగా, దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శివసేవకులు కౌంటింగ్‌లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement