Thursday, May 2, 2024

సముద్రంలో పడవ బోల్తా – తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతు

నిజాంపట్నం ఆగస్టు 20 ప్రభ న్యూస్ :- నిజాంపట్నం హార్బర్ వద్ద పడవ ప్రమాదంలో నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ గ్రామానికి చెందిన తల్లి ఇద్దరు పిల్లలు గల్లంతైన సంఘటన జరిగింది. నిజాంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సోంబాబు అతని భార్య సాయి వర్ధిక వారికి ఉన్న చిన్న బోటు ద్వారా సముద్ర వేట ద్వారా వచ్చిన మత్స్య సంపదను విక్రాయించి జీవనం చేస్తుంటారు, వీరికి ఇద్దరు కుమారులు. వీరిద్దరి పిల్లలను చూసుకునే పెద్దవారు లేకపోవడంతో ఇద్దరు పిల్లలు కూడా తన భార్యతో పాటు శనివారం రాత్రి వేటకు తమతో పాటు వేటకు తీసుకుని వెళ్లారు.

మత్స్య సంపదను అమ్ముకునే నిమిత్తం నిజాంపట్నం హార్బర్ కు వస్తున్న క్రమంలో సముద్రం నుండి హార్బర్ కు వచ్చే మొగ దగ్గర ఒక్కసారిగా పెద్ద అలలు రావటంతో బోటు అదుపుతప్పి అక్కడ ఉన్న రాళ్లకు గుద్దుకుని తిరగబడిందని, బోటు లో ఉన్న నలుగురు సముద్రంలో పడిపోగా, సోంబాబు ఈత వేసుకుంటూ ప్రాణాలు దక్కించుకుని ఒడ్డుకు చేరుకున్నాడని తెలిపారు.

. అతని భార్య సాయి వర్ధిక (25), ఇద్దరు కుమారులు తనీష్ కుమార్ (7), తరుణేశ్వర్ (11 నెలలు) సముద్రంలోనే గల్లంతయ్యారని, వారికోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టినట్లుగా, ఇప్పటివరకు గల్లంతయిన వారి ఆచూకీ తెలియ రాలేదని, దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై రమేష్ బాబు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement