Thursday, April 25, 2024

పోలీసులు- వైసీపీ కార్యకర్తలకు తేడా ఏమీ లేదు

బద్వేల్ లో పోలీసులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు వైసిపి పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. నాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో దాన్నే బద్వేలులో పునరావృతం చేస్తున్నారని మండిపడ్డారు.  మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి హౌస్ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా ?అని ప్రశ్నించారు. పోలీసులులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారు? అని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు.

ఇది కూడా చదవండి: బద్వేల్ ఉపఎన్నిక: అట్లూరులో దొంగ ఓట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement