Friday, April 19, 2024

ఓటు వేసిన గెల్లు శ్రీనివాస్..గెలుపుపై ధీమా..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టిఆర్ ఎస్ అభ్య‌ర్థిగా నిలుచున్న గెల్లు శ్రీనివాస్ జమ్మికుంట మండలం హిమ్మత్‌ నగర్‌ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన గెల్లు శ్రీనివాస్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.తన ఓటు హక్కు వినియోగించుకున్నానని… ప్రజాస్వామ్యం పరిఢిల్లాలంటే అందరూ ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని… హుజూరాబాద్ ప్రజలు మార్పు కి నాంది కావాలని అన్నారు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకైతే.. చెదురు మదురు సంఘటన మినహా హుజురాబాద్‌ బై పోల్‌ ప్రశాతంగానే సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement