Friday, April 26, 2024

బద్వేల్ ఉపఎన్నిక: అట్లూరులో దొంగ ఓట్లు

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉపఎన్నిక కొనసాగుతోంది. అయితే, పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్ల కలకలం రేగింది. అట్లూరులో 10 మంది మహిళలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. వారి వద్ద ఓటర్ స్లిప్పులు తప్ప ఆధార్ కార్డులు లేవని ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని ఓటు వేయనీయకుండా వెనక్కి పంపించారు. వైసిపికి అనుకూలంగా ఓట్లు వేయిస్తున్నారన్న ఆరోపణతో బద్వేల్ రూరల్ సీఐ చంద్రశేఖర్ ను ఎన్నికల విధుల నుంచి ఎన్నికల కమిషన్ తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement