Monday, May 20, 2024

మిస్ అవుతున్నారా…మిస్ చేస్తున్నారా ?

గుంటూరు జిల్లా తాడేపల్లి లో మిస్సైన బాలుడు భార్గవి తేజ్ ఇంటి పరిసరాల్లో ఉన్న అరటి తోట లో శవమై కనిపించాడు. బాలుడు కనిపించట్లేదని తల్లిదండ్రులు ఆదివారం ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే బాలుడు మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కాగా ఇదే విషయమై డి.ఎస్.పి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ బాలుడి మృతదేహంతో పై తీవ్ర గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది అన్నారు.

కాగా ఇదే గ్రామ పరిసరాల్లో పది రోజుల క్రితం కోతుల దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ బాలుడి పై కూడా కోతులు దాడి చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోతుల బారి నుండి తప్పించుకునే క్రమంలో అరటి తోట లోకి వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. మరోవైపు పోలీస్ జాగిలం,క్లూస్ టీం రెండు కూడా ఏమి కనిపెట్టలేకపోయాయి. గతంలో కూడా నెల రోజుల క్రితం ఓ బాలుడు అదృశ్యం అయ్యాడు. ఇప్పటివరకు కూడా మిస్ అయిన బాబుకు సంబంధించిన ఆచూకీ దొరకలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement