Sunday, May 19, 2024

అగ్నిపథ్​ ఎఫెక్ట్‌.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్ష‌న్‌ అమలు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : భారత్ బంద్ నేపథ్యంలో తిరుప‌తి జిల్లాలో పోలీసులు ముంద‌స్తు చ‌ర్చ‌లు తీసుకున్నారు. సోమవారం రైల్వే స్టేషన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. బంద్ పేరిట ఎవ‌రు హింసాత్మక ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

బంద్‌ సందర్భంగా విద్యార్థులు, యువకులు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామ‌న్నారు. రోడ్లపై గుంపులుగా తిరిగొద్ద‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement