Sunday, May 5, 2024

Breaking: ద‌ద్ద‌రిల్లిన బెజ‌వాడ.. త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగుల‌తో జ‌న‌సంద్రం (వీడియో)

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న కొన‌సాగుతోంది. గురువారం విజయవాడలో జరిగిన ఉద్యోగుల ప్రదర్శనతో బి ఆర్ టి ఎస్ రోడ్డు దద్దరిల్లింది.

రాష్ట్రం నలుమూలల నుండి విజయవాడకు తరలి వచ్చేందుకు సిద్ధమైన ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పలువురిని ముంద‌స్తుగానే అదుపులోకి తీసుకున్నారు. అయినా ఏమాత్రం వెరవని ఉద్యోగులు వేలాదిగా విజయవాడ త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన‌ ఉద్యోగుల ప్రదర్శన విజయవంతం కావడంతో జేఏసీ. నాయకులు హర్షం వ్య‌క్తంచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement