Sunday, May 12, 2024

విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యం.. దుబాయ్ ఎక్స్పో లో ఏపీ పెవిలియన్: మంత్రి గౌతమ్ రెడ్డి..

దుబయ్ ఎక్స్ పో -2022 సన్నద్ధత ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్షచేశారు. దుబయ్ ఎక్స్ పో సన్నద్ధత ఏర్పాట్ల పట్ల పరిశ్రమల శాఖ కృషిని అభినందించారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ప్రత్యేకమని చాటే విధంగా ఇలాగే ఐక్యతతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య జరగనున్న ఎక్స్ పోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాజ‌రుకానుందని, ఫిబ్రవరి 8న మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం దుబాయ్ ప‌య‌నం కానున్న‌ట్టు తెలిపారు. కాగా, సమీక్షకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాయింట్ డైరెక్టర్లు ఇందిరా, వీఆర్ వీఆర్ నాయక్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు తదితరులు హాజ‌ర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement