Saturday, April 27, 2024

బాబు-పవన్ భేటీ వల్ల ఒరిగేదేం లేదు.. సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల భేటీ వల్ల ఒరిగేదేం లేదని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ ను పావులా వాడుకుంటున్నారన్నారు. నటుడిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు భ్రమ పడుతున్నాడన్నారు. పవన్ తన అభిమానాన్ని తాకట్టు పెట్టారన్నారు. పవన్ బూతులు మాట్లాడుతున్నాడని, తాము రియాక్ట్ అయితే తట్టుకోలేరన్నారు. ఎన్నికలకు ముందే వికేంద్రీకరణ పూర్తి చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement