Friday, April 26, 2024

రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు బ్రేక్‌..!

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌ పడనుంది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న ఈ యాత్ర మూడు రోజుల పాటు ఆగిపోనుంది. పార్టీ మాజీ అధ్యక్షుడు, ఈ యాత్రను చేపట్టిన ఎంపీ రాహుల్‌ గాంధీ ఢిల్లీకి వెళ్లనుండడంతో ఈ నెల 24 నుంచి 26 వ తేదీ వరకు యాత్రను నిలిపేయనున్నట్లు- సమాచారం. దీపావళి పండుగతో పాటు- మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుండడంతో రాహుల్‌ గాంధీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ- (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాహుల్‌ హాజరవుతారు. అనంతరం ఈ నెల 27న భారత్‌ జోడో యాత్రను తిరిగి కొనసాగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement