Saturday, May 4, 2024

AP: దస్తగిరి తండ్రిపై దాడి…

కడప, ప్రభ న్యూస్ : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తండ్రిపై దాడి జరిగింది. పులివెందులలో ఆటో నడుపుకుంటూ షేక్ హజీ వల్లి జీవన కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్దకు వెళ్లాడు. అక్కడ తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement