Sunday, April 28, 2024

TS: ఖమ్మం జిల్లాలో బ‌స్సు బోల్తా.. 15 మందికి గాయాలు

ఖమ్మం జిల్లాలోని కూసుమంచి సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement