Sunday, May 19, 2024

AP | వ‌చ్చేనెల నుంచి గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న గణితం, సైన్సు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శిక్షణా తరగతులను డివిజన్‌ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 2వ తేదీన మ్యాథ్స్‌, 2వ తేదీ ఫిజికల్‌ సైన్స్‌, 3వ తేదీ బయోసైన్స్‌ టీచర్స్‌కు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణా తరగతులకు స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ను నియమించినట్లు తెలిపారు. శిక్షణ షెడ్యూల్‌ ప్రకారం శి బిరాల వద్ద ఇన్‌చార్జిల నియామకం, ఏర్పాట్లు చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు గైర్హాజరు కాకుండా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement