Friday, May 3, 2024

ఇంటర్‌ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానం.. ప్రభుత్వ నోటిఫికేషన్‌ సస్పెండ్‌

ఇంటర్‌ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానం ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పాత విధానం ప్రకారంగానే విద్యార్థులు చదువుతున్న కాలేజీల్లోనే ప్రాక్టికల్స్‌ నిర్వహణకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యామండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒకే కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కళాశాలల్లో పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement