Monday, April 29, 2024

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించం: స్పష్టం చేసిన ఏపీ ఆర్థిక మంత్రి

పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని కొంతమేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో పలు రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించాయి. పంజాబ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. ఈ క్రమంలో వ్యాట్ తగ్గించాలంటూ ఏపీ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.

దీంతో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. పెట్రో ధరలను తగ్గించే అవకాశం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్రో ధరలను తగ్గించేందుకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదని చెప్పారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరని, కేంద్రానికి ఉండే ఖర్చులు వేరని తెలిపారు. రాష్ట్రానికి పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ ద్వారానే ఆదాయం వస్తోందని వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రం నిర్ణయం తీసుకోలేదని మంత్రి బుగ్గన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement