Friday, April 26, 2024

ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కేసులు ఎన్ని అంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 55,520 ఐదు మంది శాంపిల్స్ సేకరించగా 1,174 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ కారణంగా తొమ్మిది మంది చనిపోయారు. అదే సమయంలో 1309 మంది నుంచి పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,37,535 కి చేరింది. ఇందులో 20,08,639 కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,061 మంది వైరస్ కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,653 కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement