Sunday, May 5, 2024

CORONA Update: ఏపీలో కొత్తగా 1,746 కేసులు.. 20 మరణాలు!

ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,341 మంది సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 1,746 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో 20 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 19,90,656 పాజిటివ్‌ కేసులు నమోద కాగా.., కోవిడ్ వల్ల మొత్తం 13,615 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం మొత్తం 18,766 యాక్టివ్‌ కేసులు ఉండగా, 19,58,275 మంది రికవరీ అయ్యారు. కోవిడ్ నుంచి 1,648 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,55,26,861 సాంపిల్స్ పరీక్షించారు.

కోవిడ్ కారణంగా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, తర్పూగోదావరి, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement