Saturday, May 4, 2024

ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంట్లలో రాష్ట్రవ్యాప్తంగా 71,030 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,869 మంది పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,316 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,87,051కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,55,052కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13582 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,53,82,763 శాంపిల్స్‌ను పరీక్షించారు.

ఇది కూడా చదవండి: ప్రశ్నిస్తే ఉద్యోగాలు తీసేస్తారా..?: కేసీఆర్ పై షర్మిల ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement