Thursday, April 25, 2024

టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు? : సీపీఐ

టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం ఆయన ఏలూరులో టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు. టిడ్కో ఇళ్ల వద్ద ఇప్పటివరకూ మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు చంద్రబాబు స్వంత నిధులతో నిర్మించలేదని, ప్రజాధనంతో నిర్మించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతోందా? అని రామకృష్ణ ప్రశ్నించారు. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని రామకృష్ణ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement