Friday, May 3, 2024

ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు..

ఏపీలో కొత్తగా 2,665 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 91,677 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 2,665 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాయి. కాగా కొవిడ్‌-19తో తాజా 16 మంది చనిపోయారు. 3,231 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,19,948కి చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య28,680గా ఉంది. కొవిడ్‌-19తో ఏపీలో ఇప్పటివరకు 13,002 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్‌ మరణాల వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరు, గుంటూరులో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళంలో ఇద్దరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇది కూడా చదవండి: అమ్మ బైలెల్లినాది అంటూ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ శుభాకాంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement