Saturday, April 27, 2024

కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా!

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. కైకాల చిన్న కుమారుడు చిన్నబాబుకు సీఎం జగన్ ఫోన్ చేసి కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం కావాలంటే అడగాలని సీఎం జగన్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నట్లు నిన్న కైకల కుమార్తె తెలిపారు. ఐసీయూలో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్న కైకల ర‌క్త‌పోటు త‌గ్గింది. కిడ్నీ ప‌నితీరు మెరుగుప‌డిందని అపోలో వైద్యులు నిన్న హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement