Saturday, April 27, 2024

ఏపీ సీఎం​ ఫారెన్​ టూర్​.. దావోస్​ సదస్సుకు వెళ్లనున్న జగన్​

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న రేప‌టి (శుక్రవారం) నుంచి మొద‌లు కానుంది. దావోస్‌లో జ‌రిగే వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే నిమిత్తం జ‌గ‌న్ ఫారిన్ టూర్ వెళుతున్నారు. ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్న ఏపీ ప్ర‌తినిధి బృందానికి జ‌గ‌న్​ నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న నిమిత్తం ఇప్ప‌టికే నాంప‌ల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమ‌తి తీసుకున్న జ‌గ‌న్‌.. శుక్ర‌వారం ఉద‌యం 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేర‌తారు. సాయంత్రం 6గంట‌ల స‌మాయానికి ఆయ‌న జ్యూరిచ్ చేరుకుంటారు. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి శుక్ర‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు జ‌గ‌న్ బృందం దావోస్ చేరుకోనుంది. 10 రోజుల పాటు జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లోనే ఉండ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement