Tuesday, May 14, 2024

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు ప్రారంభమైయ్యాయి. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి మృతిపై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గౌత‌మ్ రెడ్డితో ఉన్న అనుబంధాల‌ను మంత్రులు అనిల్, పెద్దిరెడ్డి, సురేష్, పలువురు ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు.

వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు  మంత్రి అనిల్‌ ప్రసంగించాడు.

గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు.. తోటి రాజకీయ నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement