Friday, May 3, 2024

నన్ను ఎవరూ భయపెట్టలేరు: గవర్నర్ తమిళసై సంచలన వ్యాఖ్య

తనను ఎవరూ భయపెట్టలేరని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. తాను దేనికీ భయపడని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలను గవర్నర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నా రావాల్సిన గుర్తింపు రావట్లేదని ఆమె అన్నారు. పైగా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కట్లేదని తెలిపారు. అత్యున్నత పదవుల్లోని వాళ్లూ గౌరవం పొందట్లేదని చెప్పారు. మహిళలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమాభిమానాలు పంచుతూ శాంతియుత జీవనం కొనసాగేందుకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్యవంతంగా ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలని సూచించారు. మహిళా రక్షణ, లింగ సమానత్వంతో వారు పని చేసే వాతావరణం కల్పించాలని గవర్నర్ తమిళసై పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగతం లేకుండానే ప్రారంభం అయ్యాయి. దీనిపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇలా వ్యాఖ్యనించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement