Saturday, April 27, 2024

ఏపీపై పగబట్టిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,566 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 1,378 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ కారణంగా మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,139 మంది కోవిడ్ నుంచి పూర్తి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,16,680కి చేరింది. ఇందులో 19,88,101 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో కృష్ణా లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 13,877 మంది కరోనా మహమ్మారికి బలైయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,702 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు 2,67,45,035 మంది సాంపిల్స్ ని పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: తండ్రి వైఎస్ సమాధి సాక్షిగా.. జగన్, షర్మిల కలిసిన వేళ..

Advertisement

తాజా వార్తలు

Advertisement