Thursday, April 25, 2024

రాయలచెరువు లో రాతిదూలం పోటీలు ..

యాడికి : ఈ నెల 13న రాయలచెరువు లో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ తలారి అరుణ భర్త తలారి నాగేష్ తెలిపారు. అనంతపురం ఎంపి.తలారి రంగయ్య తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భారీ మొత్తంలో బహుమతులు ఉంటాయన్నారు. మొదటి బహుమతి రూ. 80 వేలు రాయలచెరువు ఎర్రిస్వామి మినరల్స్ ఓనర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాడె లక్ష్మీనారాయణ గౌడ్ ( కె ఎల్ ఎన్ గౌడ్ ) రెండవ బహుమతి రూ. 50 వేలు నాగమణి పౌల్ట్రీ ఫామ్ గడ్డం సుదర్శన్, సారవ కట్టెల డిపో ఎరికల గుర్రప్ప అందజేస్తారు. మూడవ బహుమతి రూ. 30,000 శబరి మినరల్స్ సుంకర రమణ, 4వ బహుమతి రూ. 20,000 లక్ష్మీ రంగా ఏజెన్సీస్ ఎంపిసి రంగనాయకులు, 5వ బహుమతి రూ.10,000 కోనాపురం డాక్టర్ వెంకట రమణ అందిస్తారని తెలిపారు. వృషభ రాజాల‌ యజమానులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.. పూర్తి వివరాలకు డాక్టర్ శివ 9705728208, రవి 8096065555, బిల్డర్ శివ 9052104674 ఫోన్ నెంబర్లు సంప్రదించాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement