Sunday, April 28, 2024

AP: పుట్టపర్తి చేరుకున్న నారా భువనేశ్వరి

శ్రీ సత్యసాయి బ్యూరో, ఫిబ్రవరి 13 (ప్రభన్యూస్): సత్యసాయి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. నారా భువనేశ్వరికి విమానాశ్రయంలో పుట్టపర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.

ఆయనతో తోపాటు మాజీ మంత్రి పరిటాల సునీత ,మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప, కదిరి టీడీపీ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, సవితమ్మ, సత్యసాయి జిల్లా టిడిపి నాయకులు ఉన్నారు. విమానాశ్రయంలో సత్యసాయి జిల్లా టీడీపీ నాయకులు ,కార్యకర్తలనునారా భువనేశ్వరి పరిచయం చేసుకున్నారు. కాగా నారా భువనేశ్వరి ని చూడడానికి విమానాశ్రయం వద్దకు భారీగా తరలివచ్చిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అనంతరం ఆమె ప్రత్యేక కాన్వాయ్ లో పుట్టపర్తి రూరల్ మండలం గాజుల పల్లి కి బయలు దేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement