Saturday, April 27, 2024

యువగళం పాదయాత్ర విజయవంతం చేయండి.. టీడీపీ నాయకులకు పిలుపు

యల్లనూరు ఏప్రిల్ 5 (ప్రభన్యూస్): జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలి అందుకు పార్టీ నాయకులు సహకరించాలని బుధవారం సింగనమల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాదయాత్ర నేడు గార్లదిన్నె మండలానికి చేరుకుంటున్న సందర్బంగా భారీ జన సంద్రంతో స్వాగతం పలకాలని శ్రావణి శ్రీ యల్లనూరు మండలంలోని టిడిపి నాయకులకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక మండల కేంద్రం లోని పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నాయకులకు కార్యకర్తలు విచ్చేసిన ప్రజలకు అభివాదం చేశారు. యువ నేత నారా లోకేష్ పాదయాత్ర సింగనమల నియోజకవర్గంలోకి అడుగిడుతున్న ఈ నేపథ్యంలో స్వాగత సుమాంజులు తెలియజేయాలన్నరు. పాదయాత్రను అందరు కలిసి కట్టు గా విజయవంతం చేయాలి అన్నారు. నాయకులమద్య మనస్పర్థలను ప్రక్కన పెట్టి అందరు కలిసి కట్టు గా పాదయాత్రలో పాల్గొనాలన్నారు. అక్క చెల్లెళ్ల‌ యువతి యువకులు పాదయాత్రకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం యువగళం పాదయాత్ర పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసుల రెడ్డి, రవీందర్ రెడ్డి వేణుగోపాల్ నాయుడు దొడ్లో రామాంజనేయులు భైరవ, నారాయణస్వామి కేశవ, రామక్రిష్ణ, కిట్టయ్య రత్నమయ్య, మోహన్ నాయుడు, నరేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement