Wednesday, May 8, 2024

సాయి ధ‌ర్మ‌శాల‌లో అందుబాటులో కొవిడ్ కేర్ సెంటర్…

పుట్టపర్తి రూరల్ – కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో నియోజకవర్గ కేంద్రంలో 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నోడల్ అధికారి రాము పేర్కొన్నారు. పుట్ట‌పర్తి సాయి ధర్మశాలలో కొవిడ్ సెంటర్ లో రోగులకు కావలసిన సదుపాయాలను ఏర్పాట్లను పరిశీలించారు .ఇందులో ఈసీజీ, ఆక్సిజన్ సదుపాయం, రోగులు కావలసిన మందులు అందుబాటులో ఉంటాయని వైద్య బృందం పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో చికిత్స చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గోపాలకృష్ణ, కమిషనర్ శివరామిరెడ్డి, వైద్యాధికారులు నాగరాజు నాయక్, నివేదిత, సానిటరీ అధికారి శివయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement