Thursday, May 9, 2024

మృతురాలి కుటుంబానికి మాజీ మంత్రి సునీత పరామర్శ

ఆనంతపురం రూరల్ – అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామం లో ఇటీవల మృతి చెందిన సాకే వరలక్ష్మి కుటుంబాన్ని మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. అకు తోటపల్లి గ్రామం లో స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆమె కుటుంబ సభ్యులతో మృతి చెందిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని, పార్టీ తరఫున ఆర్థిక సాయం చేసే లా చూస్తామన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సరళిపై స్థానిక టిడిపి నేతలతో ఆమె చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement