Saturday, April 27, 2024

జనసేన పార్టీలో చేరికలు- కండువా కప్పి ఆహ్వానించిన నాదెండ్ల

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు కొద్ది రోజులుగా జనసేన పార్టీ కండువా కప్పుకొనేందుకు ముందుకొస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతం కావడం, జనసేన నాయకులు, జనసైనికులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండటంతో పలువురు పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అందిస్తున్న స్ఫూర్తితో నవతరం నాయకులు పార్టీలోకి రావడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన పెంటేల బాలాజీకి మనోహర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే బండికట్ల రాజగోపాల్‌, తోట వెంకట్‌, అచ్చుకొల అరుణ్‌ కుమార్‌, తోట భూలక్ష్మి, పొన్నం శివ, భైరా మణికంఠ పార్టీలో చేరారు.

అలాగే విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గానికి చెందిన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విందుల వెంకట రమణకు మనోహర్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనోహర్‌ మాట్లాడుతూ ‘పవన్‌ కల్యాణ్‌ ప్రజాపక్షం వహిస్తూ చేపడుతున్న కార్యక్రమాలను అందరం కలసికట్టు-గా ముందుకు తీసుకువెళ్లాలి. మన పార్టీ అధ్యక్షుల వారి పర్యటనను విజయవంతం చేయాలి. ఈ క్రమంలో అధికార పక్షం వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా, కేసులుపెట్టిన ధైర్యంగా నిలబడండి. మీకు పార్టీ అండగా ఉంటు-ంది. అందుకోసం ప్రతి జిల్లాలో లీగల్‌ విభాగాన్ని ఏర్పాటు- చేశామ’ని వివరించారు. కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ- ఛైర్మన్‌ కళ్యాణం శివ శ్రీనివాస్‌, పీఏసీ సభ్యులు కోన తాతారావు, నాదెండ్ల మండలం పార్టీ అధ్యక్షుడు కోసనా పిచ్చయ్య, యడ్లపాడు మండలం పార్టీ అధ్యక్షుడు గల్లా వెంకట్రావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement