Monday, May 6, 2024

ఏపీలో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలి.. జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజ్యసభలో వంగవీటి రంగా పేరును ప్రస్తావించారు. జీరో అవర్ లో వంగవీటి రంగా పేరు గురించి జీవీఎల్ మాట్లాడారు. రంగాను కొందరు ద్రోహులు హతమార్చారన్నారు. ఏపీలో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలన్నారు. విజయవాడ లేదా కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలన్నారు. విజయవాడ ఎయిర్ పోర్టుకు రంగా పేరు పెట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement