Sunday, April 28, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు..!

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. జూటూరులో అధికార పార్టీ నేతలపై జేసీ వర్గీయులు దాడి చేయడం జరిగిందని, ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 13మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన ఘటనలో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

జూటూరులో.రెండు రోజుల క్రితం స్థలం విషయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. అయితే దాడి జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే జరిగినట్లు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.గతంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి పై పలు కేసులు నమోదు కావడం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement