Thursday, March 28, 2024

ఇండియాలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదు

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా… దేశంలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,923 మంది కోలుకున్నారు. మరో 25,968 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాకు నలుగురు బలవగా, 2417 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement