Tuesday, May 14, 2024

ఒక్క విద్యారంగంలోనే 9రకాల పథకాలు.. సీఎం జగన్

రాష్ట్రంలో ఒక్క విద్యారంగంలోనే 9రకాల పథకాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్లీనరీలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.19,617కోట్లు అందించామన్నారు. పిల్లలను బడికి పంపిస్తే.. ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పిన మాట ప్రకారం అమ్మ ఒడి ఇస్తున్నామన్నారు. అమ్మ ఒడితో 80లక్షల మంది పిల్లలకు మంచి జరుగుతోందన్నారు.

పిల్లల చదువు కోసం రూ.52వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రజల బాగోగుల కోసం దుష్టచతుష్టయం ఏనాడైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. ధర్మం వైపు మనమున్నాం.. అధర్మం వైపు వాళ్లున్నారన్నారు. బాబు హయాంలో ఆరోగ్య శ్రీ ని నీరుగార్చారన్నారు. బాబు హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement