Thursday, May 16, 2024

రూ.2.66 కోట్ల మద్యం బాటిళ్లు ధ్వంసం : ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

కర్నూలు : కర్నూలు జిల్లాలోని వివిధ సెబ్ స్టేషన్ పరిధిలోని 593 కేసులలో పట్టుబడిన 66 వేల మద్యం బాటిళ్ళను శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ సమక్షంలో ధ్వంసం చేశారు. కర్నూలు మండలం, పంచలింగాల గ్రామం నుండి ఈ తాండ్రపాడు గ్రామంకు వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి వద్ద గల రోడ్ నందు మద్యం బాటిళ్ల‌ను ధ్వంసం చేశారు. 2021 -2022 సంవత్సరాలకు సంబంధించి కేసులలో పట్టుబడినవిగా పోలీసులు పేర్కొన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై గట్టి నిఘా ఉంచి కట్టడి చేయాలని సెబ్ పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ (సెబ్ అడిషనల్ ఎస్పీ) ప్రసాద్, ఏఈఎస్ ఇన్ చార్జి రాజశేఖర్, కర్నూలు సబ్ స్టేషన్ సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement