Tuesday, May 7, 2024

AP | 9 మందికి డీఈవోలుగా పదోన్నతులు..

అమరావతి, ఆంధ్రప్రభ : విద్యా శాఖలోని ఆయా విభాగాలలో పనిచేస్తున్న 9 మందికి జిల్లా విద్యా శాఖాధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ బుధవారం విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు పి.వి.జె. రామారావు, ప్రకాశం డి. సుభద్ర, భీమవరం ఆర్‌. వెంకట రమణ, వైఎస్‌ఆర్‌ కడప ఎమ్‌. అనురాధ, పార్వతీపురం జి. పగడలమ్మ, విజయనగరం ఎన్‌. ప్రేమ్‌ కుమార్‌, శ్రీకాకుళం కె. వెంకటేశ్వరరావు, అనంతపురం బి. వరలక్ష్మి, చిత్తూరు సి. దేవరాజు లను ఆయా జిల్లాలకు విద్యా శాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారు 15 రోజులలోగా బాధ్యతలను చేపట్టాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. పాఠశాల విద్య కమిషనర్‌ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రవీన్‌ ప్రకాష్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement