Monday, April 29, 2024

విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేకిస్తూ-36గంట‌లు స‌త్యాగ్ర‌హ దీక్ష‌

నేడు విశాఖ కూర్మ‌న్న పాలెంలో 36గంట‌ల పాటు విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు ఉక్కు సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. ఉక్కు పరీరక్షల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం వరకు కొనసాగనున్నది. 75వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని దీక్షా శిబిరంలో కూర్చున్న నేతలు పేర్కొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement