Sunday, May 5, 2024

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. సందడిగా ఆలయ పరిసరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావటం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీనికి తోడు వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి సుమారు రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. భక్తులు రెండు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. పెద్ద ఎత్తున జనం తరలి రావటంతో ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు, ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement