Sunday, May 19, 2024

ఈ నెల 26నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు-కుంకుమార్చ‌న‌లో పాల్గొనే వారికోసం 20వేల టిక్కెట్లు

ఈ నెల 26వ తేదీ నుంచి బెజవాడలోని దుర్గామాత సన్నిధిలో ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయ‌ని ఆల‌య ఈవో భ్రమరాంబ వెల్లడించారు. ప‌ది రోజుల పాటు ఈ ఉత్స‌వాలు కొన‌సాగుతాయి. ప‌లు అలంకారాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. మూలా నక్షత్రం రోజు ఏపీ సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో వెల్లడించారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు ఉండవన్నారు. భక్తులకు గతంలో మాదిరిగానే రూ.100, రూ.300, టికెట్ల దర్శనాలతో పాటుగా, ఉచిత దర్శనాలను కొనసాగించనున్నట్లు అమె తెలిపారు.

కరోనా తగ్గడంతో 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంపై సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కుంకుమార్చనలో పాల్గొనే వారికోసం 20 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తాంమని ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. భవానీ భక్తులు దర్శనాలకే రావాలని.. మాల వితరణకు అవకాశం లేదంటూ ఈవో సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement